Saturday, May 18, 2024

TS : ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో సీఎం ప్రచారం

లోక్‌స‌భ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నేడు కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

- Advertisement -

ఉదయం 11 గంటలకు కొత్తగూడెంలో జరిగే జన జాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 5 గంటలకు మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొత్తకోటలో జరిగే కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొంటారు. ఇక సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్‌లో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు ముషీరాబాద్‌లో కార్నర్ మీటింగ్‌కు హాజరై ఎంపీ అభ్యర్థుల తరపున ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement