Friday, May 17, 2024

AP : నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జ‌గ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం

వైసీపీ ఛీఫ్‌, సీఎం జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో వైసీపీ శాసనసభ, పార్లమెంటు అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారాన్ని నిర్వహించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

నేటి ఉదయం హిందూపుర పార్లమెంటు పరిధిలోని హిందూపురం పట్టణంలో జరిగే సభలో జగన్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం చిత్తూరుపార్లమెంటు పరిధిలోని పలమనేరు నియోజకవర్గం పరిధిలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు నెల్లూరు నియోజకవర్గంలోని నెల్లూరు నగరంలో జరిగే ప్రచారానికి ఆయన హాజరు కానున్నారు. మూడు నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement