Friday, April 26, 2024

ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరి మృతి.. పెళ్లికి వెళ్లివ‌స్తూ..

భూపాలపల్లి (ప్రభ న్యూస్ ): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యాక్సిడెంట్ జ‌రిగింది. రేవన్న మండలం జగ్గయ్యపేట క్రాస్ వద్ద శుక్రవారం అర్ధ రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పు ఒకరు చ‌నిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గణపురం మండలం గాంధీనగర్ కు చెందిన మాదం ఐలయ్య తన భార్య కోమలతో కలిసి జూబ్లీ నగర్ లోని బంధువుల పెళ్లికి వెళ్లారు. శుక్రవారం రాత్రి పెళ్లి ఊరేగింపు అనంతరం ఐలయ్య ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరాడు.

ఈ క్రమంలో జగ్గయ్య పల్లె క్రాస్ వద్ద బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐలయ్య అక్కడి కక్కడే మృతి చెందాడు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో అతడిని ఎవరూ గుర్తించలేదు. ఉదయం అటుగా వెళ్తున్న వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement