Friday, April 26, 2024

తిరుమ‌ల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

తిరు‌మల వేంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికె‌ట్లను తిరు‌మల తిరు‌పతి దేవ‌స్థానం (TTD) విడుదల చేసింది. జులై, ఆగస్టు నెలలకు సంబం‌ధిం‌చి టికె‌ట్లను వెబ్‌‌సైట్‌ ద్వారా బుక్‌ చేసు‌కో‌వా‌లని సూచించింది.

రోజుకు 25 వేల చొప్పున టికెట్లను టీటీడీ అందుబాటులో ఉంచింది. కాగా, వేసవి సెల‌వుల్లో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టు‌కొని జులై 15 వరకు శుక్ర, శని, ఆది‌వా‌రాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనా‌లను రద్దు చేసి‌నట్టు అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్‌ దర్శనా‌లను కేవలం ప్రొటో‌కాల్‌ ప్రము‌ఖు‌లకు పరి‌మితం చేసి‌నట్టు స్పష్టం‌చే‌శారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement