Tuesday, April 23, 2024

పెరుగుతున్న కరోనా కేసులు : 2323 కొత్త కేసులు

భారతదేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 2323 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,31,34,145కు చేరాయి. ఇందులో 4,25,94,801 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. మరో 5,24,348 మంది మరణించగా, 14,996 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 25 మంది కరోనాకు బలవగా, 2346 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాలు 1.22 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement