Wednesday, May 1, 2024

PM Modi: మే 3, 4 తేదీల్లో ఏపీలో ప్రధాని మోడీ పర్యటన

అమరావతి : ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే నెల‌ 3,4 తేదీల్లో రాష్ట్రానికి రానున్నారు. మే 3న మధ్యాహ్నం 2.45కు పీలేరు, సాయంత్రం 6.30కు విజయవాడలో రోడ్‌ షో, 4న రాజమండ్రి, అనకాపల్లిలో ప్రధాని మోదీ పర్యటన ఉండనుంది. మధ్యాహ్నం 3.45కు రాజమండ్రి, సాయంత్రం 6 గంట‌ల‌కు అనకాపల్లిలో మోడీ పర్యటించనుననట్లుగా సమాచారం.

అలాగే ఆ తేదీల్లోనే ప్ర‌ధాని మోడీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప‌ర్య‌టించ‌నున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement