Saturday, April 27, 2024

TS: ఓడిపోతామ‌ని తెలిసే.. కుంటి సాకులు వెతుకుతున్నారు: మేయ‌ర్ సునీల్‌రావు

క‌రీంన‌గ‌ర్‌: రేపు జరిగే హుజురాబాద్ ఎన్నికల కౌంటింగ్ లో ఓడిపోతామని తెలిసి బీజేపీ నాయకులు కుంటిసాకులు వెతుకుతున్నార‌ని క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్ సునీల్‌రావు అన్నారు. ఈరోజు మీడియాతో ప‌లు అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు..

ఇంకా ఏమ‌న్నారంటే..
‘‘రాజ్యాంగ బద్దంగా జరిగిన ఎన్నికల ప్రక్రియను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. బీజేపీ నాయకులకు ఈవీఎం లకు వీవీ ప్యాడ్ లకు తేడా తెలియకపోవడం సిగ్గుచేటు. అసత్య ప్రచారం చేయడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం, అబద్దాలతో ప్రజలను మోసం చేయడంలో బీజేపీ నాయకులు నిష్నాతులు. రేపటి కౌంటింగ్ లో 15 వేల మేజార్టీతో టీఆర్ఎస్ గెలుపు ఖాయం.

రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమానికి హుజురాబాద్ ప్రజలు మద్దతు తెలిపారు. ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలను భయపెట్టి, మభ్యపెట్టి బీజేపి నాయకులు ప్రలోభాలకు గురిచేశారు. అసత్య ప్రచారాలు, చిల్లర ప్రయత్నాలతో హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపి నాయకులు అపహాస్యం చేస్తున్నారు. ప్రజలు వాస్తవాలు గమనించాలి. ఇప్పటికైనా బీజేపి పార్టీ నాయకులు చౌక బారు తనం,  చిల్లర ప్రయత్నాను ఇప్పటికైనా మానుకోవాలి.

టీఆర్ఎస్ స్థానికేతరులు హుజురాబాద్ ఎన్నికల్లో ప్రజలను ప్రలోబాలకు గురి చేస్తున్నారని అసత్య ప్రచారం చేసిన బీజేపి నాయకులు. వీణవంక మండలంలో పర్యటించి ప్రలోబాలకు గురిచేసిన తుల ఉమ స్థానికురాలా, స్థానికేతరురాలా..? అన్నది బీజేపి పార్టీ నాయకులు గమనించాలి. కేసిఆర్ హుజురాబాద్ లో సభకు వస్తే ఓటమి ఖాయమని బీజేపి నాయకులు కేసిఆర్ సభ నిర్వాహానకు ఆటంకం కలిగించారు. టీఆర్ఎస్ పార్టీ బాధ్యత యుతమైన పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమక్షేమమే ద్యేయంగా పని చేశాం. అదే స్పూర్తితో ఓట్లు అడిగాం.

చౌక బారు, చిల్లర ప్రయత్నాలు చేయలేదు. ఈటెల రాజేంధర్ 6 సార్లు గెలిచినా అనామకునిగా మాట్లాడుతున్నారు. ఈవీఎం లు మార్చారంటూ అసత్య ప్రచారం చేస్తూ… ఓడిపోతామని తెలిసి కుంటి సాకులు వెతుకుతున్నారు. ఈవీఎం, వీవీ ప్యాడ్ మిషన్ మద్య తేడా తెలియకపోవడం ఈటెల రాజేంధర్ కు సిగ్గు చేటు. ఎన్ని ఎత్తుగడు, అసత్య ప్రచారాలు, చౌక బారు ప్రయత్నాలు చేసిన రేపటి కౌటింగ్ లో టీఆర్ఎస్ పార్టీదే విజయం’’. అని సునీల్ రావు ధీమా వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement