Thursday, April 25, 2024

సెల్వామణితో కబడ్డీ ఆడుకున్న రోజా.. ఎందుకో తెలుసా!

అటు రాజ‌కీయాల‌తో పాటు బుల్లితెర షో కి జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు రోజా..ఈమెకి మ‌రో పేరు ఉంది అదే ఫైర్ బ్రాండ్ అని. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రోజా క‌బ‌డ్డీ ఆడారు. అది కూడా త‌న భ‌ర్త సెల్వ‌మ‌ణితో క‌లిసి. ఇప్పుడీ వార్త తెగ ట్రెండ్ అవుతోంది. మ‌రి ఆమె ఎక్క‌డ క‌బడ్డీ ఆడారో తెలుసా.. న‌గ‌రి నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల‌లో గ్రామీణ క్రీడా పోటీలు నిర్వ‌హించారు. అయితే ఈ క‌బ‌డ్డీ పోటీల‌కు రోజా మ‌రియు సెల్వ‌మ‌ణి అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఇక యువ‌కులు క‌బ‌డ్డీ ఆడుతుండ‌గా రోజా సెల్వ‌మ‌ణి కూడా ఆ ఆట‌లో చేరిపోయారు.

ఇక ఆట‌లో భాగంగా రోజా..సెల్వ‌మ‌ణిలు చెరో జ‌ట్టుకు ఆడారు. మొద‌టగా రోజా కూత‌కు వెళ్ల‌గా ఆమెను సెల్వ‌మ‌ణి అరెస్ట్ చేయ‌లేక‌పోయారు. ఇక ఆ త‌ర‌వాత సెల్వ‌మ‌ణి కూత‌కు వెళ్ల‌గా రోజాతో పాటుగా ఇత‌ర క్రీడాకారుల‌ను ఔట్ చేయ‌లేక‌పోయారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో కూడా రోజా క‌బ‌డ్డీ ఆడిన వీడియో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇక తాజాగా ఆడిన వీడియో కూడా నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియాలో కూడా రోజా ఎంతో యాక్టీవ్ గా ఉంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక ఆమె కుమార్తై అన్షూ కూడా సినీ రంగ‌ప్ర‌వేశం చేయ‌బోతోంద‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. చూడాలి ఏమవుతుంద‌నేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement