Thursday, May 2, 2024

Mumbai: సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి

ముంబైలో 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. కార్మికులు మురుగు కాలువను శుభ్రం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. నిర్మాణ స్థలంలో మురుగు కాలువను శుభ్రం చేస్తుండగా ముగ్గురు కూలీలు దాదాపు 40 అడుగుల లోతున్న ట్యాంకులో పడిపోయారు.

- Advertisement -

ఈ సంఘటన ముంబైలోని మలాడ్ వెస్ట్ దిండోషి ప్రాంతంలో జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, బీఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని రాజుగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement