Saturday, May 4, 2024

TS : బైక్ ఢీకొన్న ప్రైవేటు బ‌స్సు..న‌లుగురు విద్యార్థులు మృతి

వ‌రంగ‌ల్ జిల్లాలో విషాధం నెల‌కొంది. ఇంట‌ర్ పాస‌య్యామ‌న్న ఆనందం కొద్దిక్ష‌ణాల్లోనే ఆవిరైంది. బైక్‌ను ప్రైవేటు బ‌స్సు ఢీకొన‌డంతో న‌లుగురు ఇంట‌ర్ విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న వర్ధన్నపేట పట్టణ శివారు ఆకేరు వాగు వంతెన వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

వరంగల్‌ జిల్లా వరంగల్‌-ఖమ్మం జాతీయ రహదారిపై బైక్‌ను ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన నలుగురు ఇంటర్ విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్‌, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్‌ తేజ్‌, పొన్నాల రనిల్‌ కుమార్‌లు ఒకే బైక్పై ఇల్లంద నుంచి వర్ధన్నపేట వైపు వెళుతుండగా.. ఎదురుగా వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరిలో గణేశ్‌ ఇంటర్‌ ఫలితాల్లో మంచి మార్కులతో పాస్ కాగా.. మిగతా ముగ్గురితో కలిసి పార్టీ చేసుకున్నాడు. అలా ఒకే బైక్ పై నలుగురు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలం వద్ద మలుపు ఉండటం.. రెండు వాహనాలు వేగంగా రావడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement