Thursday, May 16, 2024

Tributes – పివికి దాస్యం ఘ‌న నివాళి..

హైద‌రాబాద్ వరంగ‌ల్ – బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు,మాజీ ప్రధానమంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు జయంతి సంద‌ర్బంగా మండ‌లిలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ శాసన సభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొని పివికి నివాళుల‌ర్పించారు. ఈ సందర్భంగా దాస్యం మాట్లాడుతూ పివి నరసింహ రావు దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప ఆర్థిక వేత్తగా పేరు తెచ్చుకొని దేశానికి తన సేవలను అందించారు అని కొనియాడారు. దేశం తో పాటు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించిన ఆ మహానుభావుడికి తన చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవమానాలకు గురి చేశారు అని అన్నారు.కాని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం ముఖ్య మంత్రి కేసిఆర్ మాజీ ప్ర‌ధాని పివి నరసింహ రావు పట్ల ఉన్న అభిమానంతో వారి జయంతి,వర్ధంతి ఉత్సావాలను అధికారికంగా నిర్వహిస్తు వారి కుటుంబ సభ్యులకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించి గౌరవించార‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్ పీవీ నరసింహారావు కుమార్తె ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి , విప్ ప్రభాకర్ , ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య ,ఎల్ రమణ , అధికారులు, తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement