Sunday, April 28, 2024

TS: కాసేపట్లో తెలంగాణ కేబినెట్‌ భేటీ..

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపోమాపో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ రానుందనే ప్రచారం నేపథ్యంలో కేబినెట్‌ భేటీ కానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలే ఈ భేటీ ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీ పునరుద్ధరణ, వారికి రూ.5 లక్షల జీవిత బీమా పథకం అమలు తదితర అంశాలపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటనపై సైతం మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement