Sunday, May 5, 2024

TS : బిజెపి ముసుగులో ఆర్ఎస్ఎస్… మంత్రి సీత‌క్క

చేనేత వ‌స్త్రాల‌పై జీఎస్టి పెంచి ఆఖరికి బట్ట కట్టుకొని పరిస్థితి తెచ్చిన మోడీకి ఎందుకు ఓటు వేయాల‌ని ప్ర‌శ్నించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి. ములుగులో ఆమె నేడు మీడియాతో మాట్లాడుతూ, చీరల మీద సైతం జీ ఎస్టీ వేశారని మండిపడ్డారు. ఉద్యోగం అడిగితే దేవుడిని చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

అభివృద్ధి అడిగితే అయోధ్య ను చూపిస్తున్నారు. తాము అధికారంలోకి వ‌చ్చి మూడు నెలల్లో 34 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గాంధీ ని చంపిన గాడ్సే మీ నాయకుడు అంటూ బ బిజెపిపై కీలక వ్యాఖ్యలు చేశారు. గాడ్సే అంటే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ అని హాట్ కామెంట్స్ చేశారు.

ముగ్గురు ప్రధానులు చేసిన కుటుంబంలో పుట్టిన రాహుల్ గాందీ కుటుంబానికి సొంత ఇల్లె లేదని గుర్తు చేశారు. మ‌రి ప్ర‌ధాని మోడీ సూట్ 16 లక్షలు..మేకప్ కే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపి రాజ్యాంగం మారుస్తాం అంటున్నారని, అలా అయితే మన హక్కులు పోతాయని, రిజర్వేషన్ లు పోతాయని సీతక్క గుర్తు చేశారు. ఇటువంటి పార్టీని చిత్తుగా ఓడించాల‌ని సీత‌క్క పిలుపు ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement