Friday, May 3, 2024

AP : టిడిపిలో చేరిన కోడిక‌త్తి శ్రీను

వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు కోడికత్తి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. కోనసీమ జిల్లాలోని ఠాణేలంకకు చెందిన జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి శ్రీను తన అన్న సుబ్బరాజు కుటుంబంతోపాటు . టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ముమ్మిడివరం అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు సమక్షంలో సైకిల్ పార్టీలో చేరారు.. వారంద‌రికీ బుచ్చిబాబు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా శ్రీను మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించానని, పరిస్థితులు అందుకు అనుకూలించకపోవడంతో టీడీపీలో చేరినట్టు తెలిపారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం కోసం చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైలులో మగ్గిపోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్ని పార్టీల నుంచి మద్దతు లభించిందని, అయితే తాను అభిమానించిన వైసీపీ నుంచి మాత్రం ఎవరూ సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈ రోజు బతికి ఉండడానికి ఎస్సీ సంఘాలు, ప్రతిపక్షాలే కారణమన్న ఆయన.. తన విడుదలకు కారణమైన అన్ని పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement