Sunday, May 12, 2024

సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరలపై హైకోర్టులో విచారణ

తెలంగాణలో సినిమా థియేటర్లలో టిక్కెట్లు ధరలపై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టికెట్ల ధరలను నిర్ణయించడానికి  ఎటువంటి రూల్స్ ఫ్రేమ్ చేశారని హైకోర్టు ప్రశ్నించింది. టికెట్ల ధరలు నిర్ణయించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.  ఆ కమిటీ సూచనలు ప్రభుత్వానికి నివేదించినట్లు కోర్టుకు తెలిపారు. కమిటీ నివేదికపై నాలుగు వారాల్లో ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టుకు తెలపాలని హైకోర్టు స్పష్టం చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ, హోం శాఖ సెక్రెటరీలకు హైకోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement