Saturday, April 27, 2024

Suryapet – మెడికల్ కళాశాల, ఇంటెగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభించిన కెసిఆర్ …

 సూర్యాపేటలో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తున్నారు. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో నేరుగా సూర్యాపేటకు చేరుకున్న సీఎం . తొలుత రూ.500 కోట్లతో చేపడుతున్న మెడికల్‌ కళాశాలకు సంబంధించి రూ.156 కోట్లతో నిర్మించిన ప్రధాన భవనాలను ప్రారంభించారు. అనంతరం రూ.30.18 కోట్లతో పాత వ్యవసాయ మార్కెట్‌లో నిర్మాణమైన ఇంటెగ్రేటెడ్‌ మోడల్‌ మార్కెట్‌ను ప్రారంభించారు.

అనంతరం మార్కెట్‌ అంతా కలియతిరిగి పరిశీలించారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రి జగదీశ్‌ రెడ్డి, సూర్యాపేట జిల్లా ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్‌, శాణంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌ తదితరులు ఉన్నారు.  అక్కడి నుంచి నేరుగా రూ.38.50 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా పోలీసు కార్యాలయం వద్దకు చేరుకొని ప్రారంభించారు కెసిఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement