Monday, May 6, 2024

కోడె మొక్కు చెల్లించుకున్న ఎమ్మెల్యే దాస‌రి దంపతులు

వేముల‌వాడ – దక్షిణ కాశీగా విరాజుల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని పెద్దపెల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ స్వామి వారిని దర్శించుకుని అభిషేకం,కోడె మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం ఎమ్మెల్యే దంపతులకు ఆలయ అర్చక బృందం ఆశీర్వచనం గావించారు. ఆలయ అధికారులు తిరుపతిరావు ఎమ్మెల్యే దంపతులకు రాజన్న చిత్రపటం, ప్రసాదం అందజేసి ఘనంగా సత్కరించారు. వారి వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ ఇన్స్పెక్టర్ అశోక్ ,పోసాని రాజు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement