Wednesday, May 8, 2024

బీటీ రోడ్డుపై కేజీవీల్స్‌ ట్రాక్టర్లు నడిస్తే సీజ్‌..

రోడ్డుపై కేజ్‌వీల్‌ ట్రాక్టర్‌ కనిపిస్తే వెంటనే సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి. బాన్సువాడలో పర్యటించిన పోచారం శ్రీనివాస రెడ్డి ఈ విధంగా కామెంట్ చేశారు. గతంలో రాష్ట్రం మొత్తానికి కలిపి రోడ్ల మరమ్మతులకు రూ.300 కోట్లు మంజూరు చేసేదని, కానీ స్వరాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గానికే 300 కోట్ల నిధులు తెచ్చి నాణ్యమైన రోడ్డు వేశామన్నారు. కోటగిరి మండలం హెగ్డోలి నుంచి యాద్గార్‌పూర్‌ మీదుగా రూ. 3 కోట్లతో బీటీ రోడ్డు వేశామని, అక్కడ కూడా కేజ్‌వీల్‌ ట్రాక్టర్లు తిప్పుతున్నారని అన్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలతో ప్రజల కోసం వేసిన బీటీ రోడ్డుపై కేజీవీల్స్‌తో నడిచే ట్రాక్టర్లను సీజ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: బాలానగర్ ఫ్లై ఓవర్ ప్రారంభం

Advertisement

తాజా వార్తలు

Advertisement