Monday, April 29, 2024

తమిళనాడులో వింత ఘటన.. మద్యం తాగిన ఎలుకలు

తమిళనాడులో వింత ఘటన చోటుచేసుకుంది. కరోనా సంక్షోభం అనంతరం మద్యం దుకాణం తెరిచిన తమిళనాడు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు 12 ఖాళీ వైన్ బాటిళ్లను చూసి షాక్‌కు గురైన ఘటన నీలగిరి జిల్లాలో చోటుచేసుకుంది. గుడలూరు సమీపంలోని కదంపూజ పట్టణంలో ప్రభుత్వం మద్యం దుకాణం నడుపుతోంది. కరోనా వ్యాప్తి వల్ల విధించిన లాక్ డౌన్ కారణంగా ఈ మద్యం దుకాణాన్ని మూసిఉంచారు. దీంతో ఎలుకలు బాటిళ్ల మూతలను కొరికి వైన్‌ను తాగాయని తేలింది. దుకాణంలోని 12 క్వార్టర్ మద్యం బాటిళ్ల మూతలు ఎలుకలు కొరికి ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు కనుగొన్నారు. ఎలుకలు మద్యం తాగిన ఘటనపై సీనియర్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: సూర్యాపేట జిల్లాలో ఆకట్టుకుంటున్న రెడీమేడ్ ఇల్లు

Advertisement

తాజా వార్తలు

Advertisement