Friday, April 26, 2024

పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు.. జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధు

పెద్దపల్లి – తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పోలీస్ శాఖలో తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేసిందని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సురక్ష దివస్ లో పాల్గొన్నారు. ఎందరో పోలీస్ అమరవీరుల త్యాగ ఫలితంగా ప్రస్తుతం సమాజంలో శాంతి నెలకొందని అలాంటి పోలీసుల సేవర్లను గుర్తించి ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డిసిపి వైభవ్ గైక్వాడ్ తో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement