Friday, May 17, 2024

నీళ్ల‌కోసం పంపు ద‌గ్గ‌ర‌కు వెళ్తే.. తెగిప‌డ్డ వైరు షాక్ కొట్టి మ‌హిళ మృతి

శంకర్ పల్లి (ప్రభన్యూస్): రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌ప‌ల్లి మండలంలో ఘోరం జ‌రిగింది. మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలోని లేబర్ కాలనీలో ఉంటున్న తారా నేవారే (32) విద్యుత్ షాక్‌తో చ‌నిపోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ మహిళ త‌న కుటుంబంతో లేబర్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ రోజు లేబర్ కాలనీలోని నీటి సంపు నుండి నీటిని తీసుకువచ్చే క్రమంలో విద్యుత్‌షాక్‌కి గుర‌య్యింది. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులకు తెగి పడి ఉన్న విద్యుత్ వైరును చూసుకోలేక అక్క‌డే కాలు పెట్టడంతో షాక్ తో గురై అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement