Friday, May 17, 2024

కొరియా ఓపెన్ ఫైనల్‌లోకి మ‌నోళ్లు.. చైనాపై అద్భుత విజ‌యం!

కొరియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి థ్రిల్లింగ్ స్ట్రెయిట్ గేమ్ విజయంతో ఫైనల్‌లోకి ప్రవేశించారు. శనివారం యోసులో జరిగిన మ్యాచ్ లో ప్రపంచ రెండో ర్యాంకర్ చైనా జంట అయిన‌ లియాంగ్ వీ కెంగ్, వాంగ్ చాంగ్‌లపై విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించారు సాత్విక్‌-చిరాగ్. జిన్నాం స్టేడియంలో జ‌రిగిన ఈ 40 నిమిషాల పోరులో భారత జోడీ 21-15, 24-22 తేడాతో చైనాపై విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.

ఈ ఏడాది ఇండోనేషియా సూపర్ 1000, స్విస్ ఓపెన్ సూపర్ 500 టైటిళ్లను గెలుచుకున్న సాత్విక్, చిరాగ్‌లు ఫైనల్ లో జ‌ర‌గ‌నున్న‌ శిఖరాగ్ర పోరులో ఇండోనేషియాకు చెందిన ఫజార్ అల్ఫియాన్, ముహమ్మద్ రియాన్ ఆర్డియాంటో లేదా.. కొరియాకు చెందిన కాంగ్ మిన్ హ్యూక్, సియో సెయుంగ్ జేలతో తలపడనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement