Saturday, May 4, 2024

మహిళా పరపతి సంఘాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వివేకానంద్…

కుత్బుల్లాపూర్ – గాజులరామారం డివిజన్ పరిధిలోని లెనిన్ నగర్ లో 60 మంది సభ్యులతో కలిసి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ దుర్గమ్మ పోచమ్మ మహిళా పరపతి పొదుపు సంఘాన్ని ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరి రావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బ్యాంకులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ఇలా ఎవరి సాయం లేకుండానే ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేసేందుకు మహిళలు ముందుకు రావడం సంతోషకరం అన్నారు. ఈ పరపతి సంఘం ఏర్పాటుతో ఎంతోమందికి ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. పొదుపు చేసుకున్న డబ్బుతో మహిళలు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడమే గాక ఆర్థిక పురోగాభివృద్ధి సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు డి.దుర్గ, ఉపాధ్యక్షురాలు పి.సుజాత, సుకన్య, జనరల్ సెక్రెటరీ ఎస్.పద్మ, సంయుక్త కార్యదర్శులు జి.వినోద, డి.నాగమణి, ట్రెజరర్ కె.భాగ్యమ్మ, క్యాషియర్లు పి.రత్న, పి.కల్పన మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement