Thursday, May 16, 2024

ప్రజల మౌళిక వసతుల కల్పనకు కృషి..

మొయినాబాద్‌ : మొయినాబాద్‌ మండల కేంద్రంలో ప్రజల మౌళిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మొయినాబాద్‌ గ్రామ సర్పంచ్‌ షేక్‌ కరిమాభీ మహుబూబ్‌ పేర్కొన్నారు. అండగి బజార్‌ వేలం పాటలో భాగంగా అదే గ్రామానికి చెందిన షేక్‌ లతాఫ్‌ అనే వ్యక్తి రూ. 5లక్షల 55వేల రూ.100లకు 12 నెలలకు గాను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వారం వారం నిర్వహించే అండగి బజార్లో పంచాయతీ ద్వారా మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు. మండల జిల్లా కార్యాలయం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ చిరాగు రాజేష్‌గౌడ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement