Thursday, May 16, 2024

ఏపీలో మూడు జిల్లాలలో కరోనా ఉగ్రరూపం

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,116 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,288 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 311 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 225, విశాఖ జిల్లాలో 191, కృష్ణా జిల్లాలో 164, నెల్లూరు జిల్లాలో 118, ప్రకాశం జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 54, కర్నూలు జిల్లాలో 52, విజయనగరం జిల్లాలో 31, అనంతపురం జిల్లాలో 26, తూ.గో. జిల్లాలో 26, కడప జిల్లాలో 21, ప.గో. జిల్లాలో ఏడుగురికి కరోనా సోకినట్టు గుర్తించారు. గత 24 గంటల్లో 610 మంది కరోనా నుంచి కోలుకోగా అనంతపురం, గుంటూరు, విశాఖ, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. ఏపీలో ఇప్పటివరకు 9,04,548 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,88,508 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 8,815గా నమోదైంది. కరోనా మరణాల సంఖ్య 7,225గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement