Sunday, April 28, 2024

టిడిపి నుంచి వైసిపిలో చేరిన‌ 60 కుటుంబాలు ….

అమరావతి – మండల కేంద్రమైన అమరావతి గోపాల్ నగర్ కి చెందిన యాదవ కులస్థులు 60 కుటుంబాలు ఎంపీటీసీ అభ్యర్థి మేకల హనుమంతు రావు ఆధ్యర్యంలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, వారికి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వైసిపి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ ఈ నెల 8న జరగునున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే శంకరరావు ఆకాక్షించారు. పార్టీలో చేరిన వారిలో అమరావతి పట్టణ టిడిపి కన్వీనర్ తాడిబోయిన సాంబయ్య, మాజీ దేవస్థాన కమిటీ సభ్యులు తాడిబోయిన శ్రీనివాస యాదవ్, యాదవ సంఘం అధ్యక్షుడు నల్లిబోయిన కోటేశ్వరరావు, చిoకా పెద్ద శివయ్య, మందడపు వెంకట్రావు, నేతుల శివాంజనేయులు, పెడ్డబోయిన శ్రీనివాసరావు, ఉదారు కృష్ణ వీరితో పాటు 60 కుటుంబాల వారు పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నంబూరు బాబురావు, నండూరి కరుణ కుమార్(బన్ను), అలా లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement