Thursday, April 25, 2024

మేయర్‌ కి సన్మానం..

కుత్బుల్లాపూర్‌ : నాణ్యమైన సేవలతో వినియోగదారుల మన్ననలు పొందినప్పుడే వ్యాపారాభివృద్ధికి సాధ్యమని కోలన్‌ నీలా గోపాల్‌రెడ్డి అన్నారు. నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 8 వ డివిజన్‌ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కడప కారం దోశ టిఫిన్‌ సెంటర్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని శంకర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మేయర్ కి సన్మానం చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన, రుచికరమైన టిఫిన్స్‌ అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ సురేష్‌రెడ్డి, సహా యాజమానులు ప్రసాద్‌, వెంకటరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, యాజమాన్య కుటుంబ సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement