Tuesday, April 30, 2024

పేదింటి మహిళలకు కల్యాణలక్ష్మీ వరం.. మంత్రి మల్లారెడ్డి

పేదింటి మహిళలకు కల్యాణలక్ష్మీ ఓ వరమని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు (72) చెక్కులను మంత్రి మల్లారెడ్డి పంపిణి చేశారు. అలాగే గుండ్లపోచంపల్లి మున్సిపల్ కు చెందిన (11) చెక్కులను లబ్ధిదారులకు పంపిణి చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ శరత్ చంద్ర రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నంద రెడ్డి, ఎంపీపీ రజిత రాజమల్లారెడ్డి, జడ్పీటీసీ శైలజ విజేయందర్ రెడ్డి, గుండ్లపోచంపల్లి వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, తెరాస పార్టీ మండల అధ్యక్షులు దయానంద్, శ్రీనివాస్ రెడ్డి, సహకార సంఘం అధ్యక్షులు, సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement