Monday, May 20, 2024

TS: రేవంత్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు… మోదీని సూటిగా ప్ర‌శ్నించిన జ‌గ‌దీష్ రెడ్డి

బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య లోపాయికారి ఒప్పందం
ఇద్ద‌రివీ డ్రామాలే… కేసీఆర్ త‌మకు ర‌క్షంటూ ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు..

సూర్యాపేట : తెలంగాణలో మళ్లీ కేసీఆర్ హవా మొదలైంద‌ని, కేసీఆర్‌తోనే తమకు రక్ష అని ప్రజలు నమ్ముతున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సూర్యాపేట నియోజకవర్గంలో ఇంటింటికి ప్రచారానికి జగదీష్ రెడ్డి శ్రీకారం చుట్టారు. సూర్యాపేట రూరల్ మండలం సోలిపేట, సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పలు వార్డులలో గడపగడపకు ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… నాలుగు నెల‌ల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ కక్షపూరిత వైఖరి, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యంతో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలే త‌మకు వివరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ తోడుదొంగలే అని, వారి రాద్ధాంతాలను ప్రజలు గమించారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ లోపాయకారీ ఒప్పందాలు ఒక్కొక్కొటిగా బహిర్గతమైతున్నాయని వివరించారు.

బీజేపీ ముస్లిం రిజర్వేషన్ల రద్దు పేరుతో మొత్తం రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. నోటీసుల డ్రామాతో మోదీతో రేవంత్ లోపాయికారీ ఒప్పందం బయటపడిందన్నారు. ఆ ఒప్పందంలో భాగమే రేవంత్ కు నోటీసుల డ్రామాలు అనీ ఆరోపించారు. బీజేపీకి రేవంత్‌తో ఒప్పందం లేకుంటే కవితను అరెస్ట్ చేసినట్లు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఆరు రోజుల కేసీఆర్ పర్యటనతో వార్ వన్ సైడే అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు తధ్యం అన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement