Tuesday, May 14, 2024

రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసహనం

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆపార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారన్నారు. ఇకపై రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడనని వెంకట్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానన్నారు. హుజూరాబాద్ లో చివరిరోజు నామినేషన్ వేయించామన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉంది కదా అన్నారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. అలాగే చండూరు సభకు వెళ్లడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement