Tuesday, May 21, 2024

ADB: సస్పెన్షన్ ఎత్తివేత‌.. కాంగ్రెస్ గూటికి సుజాత, సాజిద్ ఖాన్..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్) : గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కక తిరుగుబాటు చేసి సస్పెన్షన్ కు గురైన మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ పై ఎట్టకేలకు పార్టీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేసింది. ఏఐసీసీ నుండి వచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవరెడ్డి, భార్గవ దేశ్పాండేలపై సస్పెన్షన్ ఎత్తివేయడంతో మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమక్షంలో గండ్రత్ సుజాత, సుజాత, సాజిద్ ఖాన్, భార్గవ్ దేశ్పాండే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సాదరంగా స్వాగతించి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. కిసాన్ సెల్ జాతీయ నాయకులు కోదండ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నేతలు సుజాత, సాజిద్ వర్గాన్ని చేర్చుకోవడంతో ఆ పార్టీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమ‌య్యాయి. ఈనెల 5న నిర్మల్ లో రాహుల్ గాంధీ సభ, 2న ఆసిఫాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో పాత కాంగ్రెస్ నేతలు తిరిగి సొంతగూటికి చేరుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement