Wednesday, May 8, 2024

మతసామరస్యానికి ప్రతీక గ్యార్వి ఉత్సవాలు : ఎమ్మెల్యే వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్ లో గల మహబూబ్ సుబాని దర్గా వద్ద నిర్వహించిన గ్యార్వి ఉత్సవాల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్యార్వి ఉత్సవాలు హిందూ ముస్లింల ఐక్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మక్సుద్, శేఖర్ రావు, బస్వరాజు, ప్రభాకర్ గుప్త, వహీద్ ఖురేషి, అఖిల్ సాయి గౌడ్, సుదర్శన్ రెడ్డి, కుమార్ యాదవ్, అనిల్, జనార్ధన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement