Sunday, March 24, 2024

పురపాఠశాలల ఆకస్మిక తనిఖీలు

ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ ఎన్. రమేష్ పురపాలక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రత్తకన్న పురపాలక ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలలో” నాడు-నేడు “ద్వారా జరిగిన అభివృద్ధిని పరిశీలించారు. అనంతరం ఇరు పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ తో విపరీతంగా కేసులు పెరుతున్నాయని, విద్యార్థులపట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక్కడ అంతా గ్రామీణ వాతావరణం కాబట్టి ఉపాధ్యాయులే శ్రద్ధ తీసుకొని విద్యార్థులు అందరూ మాస్క్ వేసుకొనేలా చూడాలన్నారు. కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement