Sunday, May 19, 2024

Earthquake : అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. తీవ్రత 3.1గా నమోదు

అరుణాచల్ ప్రదేశ్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ సుబంసిరిలో మే 8 బుధవారం తెల్లవారుజామున 4:55 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. ప్రజలంతా నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించటంతో అందరూ ఉలిక్కిపడి మేల్కొన్నారు.

అందరూ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీసినట్టుగా స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. అయితే భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం, భూకంప కేంద్రం, దాని లోతు గురించి సమాచారం అందలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement