Sunday, May 19, 2024

MDK : అన్ని వ‌ర్గాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం… నీలం మ‌ధు

ఉమ్మడి మెదక్ బ్యూరో, మే 8 ( ప్రభ న్యూస్): మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ సమక్షంలో పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం చిట్కుల్ లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సంగారెడ్డి జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షులు మంజలి దస్తగిరి, నాయకులు మంజలి హనుమంతు, సుధా మాస్టర్, శ్యామ్, రవి, వేణు, శివన్న పాటు మరో 20 మంది తదితరులు పార్టీలో చేరారు.

వీరందరికీ ఎంపీ అభ్యర్థి నీలం మధు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమన్నారు.. కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుల వలె పనిచేసి ఎన్నికల క్షేత్రం లో విజయం కోసం పోరాడాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement