Wednesday, May 8, 2024

Fake Currency: భారీగా పట్టుబడిన నకిలీ కరెన్సీ

రంగారెడ్డి జిల్లాలోని మైలార్‌దేవ్‌పల్లిలో భారీగా ఫేక్ కరెన్సీ పట్టుబడింది. కొందరు ముఠాగా ఏర్పడి హైదరాబాద్ శివారు ప్రాంతంలో నగదు చెలామణి చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఐదు మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement