Saturday, May 18, 2024

పారిశుద్ధ్య నివారణ ..

షాబాద్‌ : అధికారులు సిబ్బంది విధుల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలని, విధినిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా పరిషత్‌ సీఈవో దిలీప్‌ కుమార్‌ హెచ్చరించారు. షాబాద్‌ మండల నారెడ్లగూడ, లింగారెడ్డిగూడ గ్రామాలలో ఆయన ఆకస్మీకంగా సందర్శించారు. గ్రామాలలోని పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటే కఠిన చర్యలు తీసుకోవడం జ రుగుతుందని హెచ్చరించారు. పల్లె ప్రకృతి వనాలు, రోడ్ల వెంబడి మొక్కలు, వైకుంఠ ధామాలు నిర్మాణాలు, డంపింగ్‌ యార్డు పనులను త్వరితరగతి పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వీటిపట్ల సర్పంచ్‌లు, కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement