Saturday, May 4, 2024

మృతుని కుటుంబానికి పరామర్శ..

షాబాద్ : కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఎల్లప్పుడు అండగా ఉంటానని టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి వెల్లడించారు. షాబాద్‌ మండల చందన్‌వెల్లి గ్రామానికి చెందిన మాల బుడ్డ బాలయ్య, అంతారం గ్రామానికి చెందిన జట్ట బాల్‌రాజ్‌లు హఠాాత్తుగా గుండెనొప్పి రావడంతో మృతి చెందారు. షాబాద్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌ తో కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒక్కొక్కరికి పదివేలు చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ బుచ్చయ్య, మాజీ సర్పంచ్‌ శేఖర్‌, చేవెళ్ల స్వామి రవీందర్‌యాదవ్‌, యాదరిగి, గోపాల్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement