Saturday, May 18, 2024

TS: మతం పేరుతో రాజకీయం చేసేవాళ్లకు బుద్ది చెప్పాలి : కేటీఆర్‌

సిరిసిల్ల: మతం పేరుతో రాజకీయం చేసేవాళ్లను నమ్మొద్దని, వారికి తగిన బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అన్నారు. పార్టీ నేతలు తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కలిసి సిరిసిల్ల పట్టణంలో కేటీఆర్‌ ఎన్నికల ప్రచారం చేశారు. కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌ను గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నేత కార్మికులకు ఉపాధి ఉండేదన్నారు. ఇప్పుడు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ వల్ల తెలంగాణకు ఒక్క రూపాయి కూడా లాభం జరగలేదని విమర్శించారు. సిరిసిల్లలో బీజేపీ ఏం అభివృద్ధి చేసిందో చెప్పాలన్నారు. ఇంతకు ముందు బ్రిడ్జి కింద నీళ్లు ఉండేవని, కాంగ్రెస్‌ వచ్చింది నీళ్లు లేకుండా పోయాయని విమర్శించారు. కాళేశ్వరం, మిడ్‌మానేరు ప్రాజెక్టులను కట్టించింది కేసీఆరేనని గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement