Saturday, May 18, 2024

ఏప్రిల్ 1 నుంచి మరిన్ని కొత్త రైళ్లు

తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు రైళ్లను నడుపుతోంది. దీంతో పాటు ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో మరికొన్ని రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-విశాఖ గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-కర్నూలు తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, కాచిగూడ-రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-వాస్కోడాగామా ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ సహా పలు రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రారంభించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement