Sunday, May 19, 2024

డిజైనింగ్ వ‌ర్క్ చేస్తుండ‌గా ప్ర‌మాదం.. చికిత్స పొందుతూ వ్య‌క్తి మృతి

నందిగామ, (ప్రభ న్యూస్): రంగారెడ్డి జిల్లాలోని నందిగామ మండలంలో బిల్డింగ్ వ‌ర్క్ చేస్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. అయ్యప్ప టెంపుల్ పరిధిలోని షాధిఖనాలో డిజైనింగ్‌ వర్క్ చేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న ఇవ్వాల (మంగళవారం) ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం , ఇష్కపూర్ గ్రామానికి చెందిన బాబుల్ మందల్ (56) కొంతకాలంగా నందిగామ మండలంలోని అయ్యప్ప టెంపుల్ ద‌గ్గ‌ర నివాసం ఉంటున్నాడు. బీప్లగ్ షాదీఖానాలో డిజైన‌ర్‌గా, ఫైబర్ ఫాల్ సీలింగ్ వర్క్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

17వ తేదీ మధ్యాహ్నం షీట్ తయారీ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారీ కింద ప‌డిపోయాడు. దీంతో అత‌డి తలకు తీవ్ర గాయాల‌య్యాయి. చికిత్స నిమిత్తం శంషాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తదుపరి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, 20వ తేదీ (మంగళవారం) ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూనే బాబుల్ చ‌నిపోయిన‌ట్టు డాక్ట‌ర్లు చెప్పారు. మృతుని తమ్ముని కుమారుడు భాస్కర్ మందల్, తండ్రి భీకాశ్ మందల్ పిర్యాదు మేరకు సీఐ సి ఎచ్.రామయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement