Tuesday, May 14, 2024

బస్సులను నడిపించండి..

యాచారం : యాచారం మండలంలో పలు గ్రామాలకు కరోనా సమయంలో రద్దు చేసిన బస్సు సర్వీస్‌లను తిరిగి కొనసాగించాలని ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్‌కు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు అలంపల్లి జంగయ్య వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాచారం మండల పరిధిలోని కొత్తపల్లి, తక్కళపళ్లి, చింతపట్ల గ్రామాలకు సాయంత్రం సమయంలో బస్సులను నడిపించాలని కోరారు. లాక్‌డౌన్‌ కంటే ముందు అన్ని గ్రామాలలో ఉదయం, సాయంత్రం వేళలలో విద్యార్థులకు, ఉద్యోగస్థులకు బస్సులను నడిపించే వారు. ప్రస్తుతం వాటిని రద్దు చేయడం వల్ల సాయంత్రం సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోంటున్నారు. కిలో మీటర్ల మేరకు నడుచుకుంటు వెళ్లే పరిస్థితి నెలకొంది. మరికొందరు ప్రైవేటు వాహనాలలో ప్రాణాలకు తెగించి మరి ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కావున వీరందరిని దృష్టిలో ఉంచుకోని సాయంత్రం సమయంలో కూడ బస్సులను నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు విప్లవకుమార్‌, ప్రేమ్‌కుమార్‌, కృష్ణ, వినయ్‌, రవి, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement