Saturday, May 25, 2024

బండి సంజ‌య్ తో రాజ‌గోపాల్ రెడ్డి భేటీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. అంకిరెడ్డిగూడెం వద్ద బండి సంజయ్ ను కలిశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో పాదయాత్ర రూట్ మ్యాప్ లో మార్పులపై బండి సంజయ్ ను అడిగేందుకు వచ్చిన‌ట్లు తెలిపారు. ఈనెల 21న అమిత్ షాతో నిర్వహించే మీటింగ్ ఏర్పాట్లపైనా చర్చించానని చెప్పారు. రాష్టంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా మునుగోడు నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేకపోయానని, తన రాజీనామాతోనైనా మునుగోడు అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. కోట్ల రూపాయల సొంత నిధులను ఖర్చు చేసి, ప్రజల కనీస అవసరాలను తీర్చానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. తాను నిజాయితీగా పని చేస్తున్నందున మునుగోడు నియోజకవర్గం ప్రజలు తన వెంటే ఉన్నారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement