Sunday, April 28, 2024

రోశయ్యతో నాకు విడదీయరాన్ని బంధం: పొన్నం

కాంగ్రెస్ కురువృద్ధుడు, రాజనీతిజ్ఞుడు, అపర చాణిక్యుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. రోశయ్యతో తనకు విడదీయరాన్ని బంధం ఉందన్నారు. ఆయనతో కాంగ్రెస్ లో కలిసి పనిచేసి చాలా విషయాలు నేర్చుకున్నానని గుర్తు చేశారు. గొప్ప వక్త, ఆర్ధిక మంత్రిగా అపార అనుభవం ఉన్న నాయకుడు, అత్యధిక సార్లు బడ్జెట్లు ప్రవేశపెట్టిన మంత్రిగా ఘనత ఆయనదే అని కొనియాడారు. రోశయ్య మృతితో కాంగ్రెస్ పార్టీ గొప్ప అనుభవశాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయామని, ఆయన మరణం ఇరు రాష్ట్రాలకి తీరని లోటు అని చెప్పారు. రోశయ్య కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తు, ఆయన ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement