Thursday, May 2, 2024

సంప్ర‌దింపుల‌తోనే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం : సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

సంప్రదింపులతోనే సమస్యలకు పరిష్కారమని.. సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఈరోజు హెచ్ఐసీసీలో నిర్వ‌హించిన IAMC స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొని మాట్లాడుతూ… హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటుకు ఎంపిక చేసుకోవడానికి కారణాలున్నాయని ఎన్వీ రమణ అన్నారు. ఈ సెంటర్ ఏర్పాటు ఆలోచన గురించి కేసీఆర్ తో ప్రస్తావించినప్పుడు సానుకూలంగా స్పందించారన్నారు.

సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ సహకారం లేకుండా సెంటర్ ఏర్పాటు సాధ్యమ‌య్యేది కాదని వెల్లడించారు. డిసెంబర్ 18 న ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ హైదరాబాద్ లో ప్రారంభోత్సవమ‌ని ఎన్వీ రమణ తెలిపారు. మహాభారతంలోనూ మధ్యవర్తిత్వం ఉందని ఆయ‌న అన్నారు. హైదరాబాద్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని కొనియాడారు. ఇక్కడ ఫార్మా, ఐటి, ఇతర పరిశ్రమలు ఉన్నాయని ఆయ‌న అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement