Friday, April 26, 2024

Breaking: బ్రోత‌ల్ హౌస్‌పై పోలీసుల దాడి.. ఆర్గ‌నైజ‌ర్ తోపాటు మ‌రో మ‌హిళ‌ అరెస్టు

జవహర్ నగర్ (ప్ర‌భ న్యూస్‌) : హైద‌రాబాద్‌లోని జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ ప‌రిధిలో బ్రోత‌ల్ హౌస్‌పై ఎస్‌వోటీ పోలీసులు ఇవ్వాల రాత్రి దాడులు నిర్వ‌హించారు. వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నార‌న్న సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ బృందం జవహర్‌నగర్ పోలీసులతో కలిసి వ్యభిచారం గృహంపై దాడి చేశారు.

సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… దమ్మాయిగూడ వాయుష్క్తినగర్‌లోని ఓ గృహంలో ఆర్గనైజర్లు సింగిడి అరుణ, కీసనకుర్తి వీర వెంకట సత్యనారాయణ కలిసి కొన్ని రోజులుగా బ్రోత‌ల్ హౌస్ న‌డుపుతున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం వ్యభిచారం గృహంపై దాడి చేశారు.

ఈ దాడిలో చినవాసుబాబుతో పాటు మరో మహిళను అరెస్ట్ చేశారు వారి నుంచి రూ. 3690 న‌గ‌దు, మూడు సెల్ ఫోన్లు, బైక్ సీజ్ చేసిన‌ట్టు సీఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి త‌దుప‌రి దర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement