Friday, April 26, 2024

వడగళ్ళకు నష్టపోయిన పంటలను పరిశీలించిన సభాపతి

నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో రెండు రోజులుగా అకాల వర్షం, భారీగా వడగల్లు పడడంతో సాగుచేసిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను బుధవారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రతి ఏడాది వేసవిలో వడగళ్ల వర్షంతో సాగు చేసిన పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని ఎవరు ఆపలేమని కానీ ప్రకృతి నుంచి తప్పించుకునే ప్రయత్నం రైతులు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. పంట దెబ్బతిన్న రైతులు అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని గత ఏడాది పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించామన్నారు.

గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలతో పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయని అతి పంటలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా పరిశీలించారని గుర్తు చేశారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు వెంటనే పదివేల రూపాయలు చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని సభాపతి తెలిపారు. పంట నష్టపోయిన రైతు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు బాగా తెలుసు అని నేను ఒక రైతు బిడ్డగా పంట సాగులో ఎన్నోసార్లు నష్టాలను చవిచూశానని సభాపతి అన్నారు.

. బాన్సువాడ మండలంలోని తాడ్కోలు కోయగుట్ట మోగలాంపల్లి తదితర గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పోచారం పరిశీలించారు. వ్యవసాయ అధికారులు రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే జరిపి పంట నష్టం పై ప్రాథమిక అంచనాలు వెంటనే ప్రభుత్వానికి పంపించాలని సభాపతి అధికారులను ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ప్రయత్నం చేస్తానని రైతులకు భరోసా ఇచ్చారు. కళ్ళల్లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కాంటాలు వేయాలని, కాంట వేసిన దాన్ని బస్తాలను వెంటనే మిల్లులకు తరలించాలని అధికారులకు సభాపతి ఆదేశాలు జారీ చేశారు

.రైతులకు చేతులెత్తి దండం పెడతా

- Advertisement -

ప్రకృతి వైపరీత్యాలు వల్ల ప్రతి ఏడాది వర్షాకాలం వేసవికాలంలో సాగుచేసిన పంటలు దెబ్బతింటున్నాయని, రైతులు పంటల సాగు విషయంలో మెలకువలు తీసుకొని యాసంగిలో నవంబర్ లోనే నారుమళ్లు పోసుకొని డిసెంబర్లో వరి నాట్లు వేసుకుంటే మార్చి నెలాఖరులోపు వరి పంట చేతికి అందుతుందన్నారు. ప్రతి ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ మాసంలో అకాల వర్షాలు వడగళ్ళు కురుస్తున్నాయని వీటివల్ల ప్రతి ఏడాది పంటల సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చదివిస్తున్నారని సభాపతి ఆవేదన వ్యక్తం చేశారు.

ఖరీఫ్లో ముందస్తుగా వరి నాట్లు వేసుకునేందుకు నిజాంసాగర్ నీటిని ముందస్తుగా విడుదల చేపిస్తానని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులకు వివరించారు. ఆయన వెంట రైతుబంధు జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి ఆర్డీవో రాజా గౌడ్, వ్యవసాయ రెవెన్యూ శాఖ అధికారులు పలువు రైతులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement