Monday, May 6, 2024

Big Breaking: మావోల ఘాతుకం.. 11మంది పోలీసుల మృతి

మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 11 మంది పోలీసులు మృతిచెందగా, మరికొందరు గాయపడిన ఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని దంతెవాడ వద్ద మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మావోయిస్టులు ఐఈడీ మందు పాతరను పేల్చడంతో 11మంది పోలీసులు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు పోలీసులు గాయపడినట్లు తెలుస్తోంది. మృతులు డిఫెన్స్ రీసెర్చ్ గ్రూప్ (డీఆర్ జీ) విభాగానికి చెందిన పోలీసులని సమాచారం. అయితే ఈ ఘాతుకానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement