Sunday, May 19, 2024

AP : పవన్ చెప్పేది సొల్లు.. మా బ‌తుకులు మ‌మ్మ‌ల్ని బ‌త‌క‌నివ్వండి.. ముద్ర‌గ‌డ‌

పవన్ చెప్పేది సొల్లు అని, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి అంటూ వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తన కుమార్తె, తనకు మధ్యచిచ్చు పెట్టే ప్రయత్నం చేయవద్దన్నారు.

కులాలు, కుటుంబాలు మధ్య చిచ్చు పెట్టడం నీ గురువు చెప్పినట్లే నువ్వు నడుచుకుంటున్నావా? నేర్చుకుంటున్నావా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎస్టేట్ లో పవన్ మేనేజర్ గా మారారన్నారు. ఆయనకే దిక్కులేదు కానీ నా కుమార్తెకు టిక్కెట్ ఇప్పిస్తానని పవన్ చెప్పడంపై ముద్రగడ పద్మనాభం ఎద్దేవా చేశారు.

- Advertisement -

గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ను గాజువాక, భీమవరంలో తన్ని తగలేశారన్నారు. ఈ ఎన్నికల్లో పిఠాపురంలోనూ పవన్ కల్యాణ్ కు ఓటమి తప్పదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు చేతిలో పావుగా మారారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. తన కుమార్తెను పవన్ కల్యాణ్ రోడ్డు మీదకు లాగారన్నారు. ముద్రగడ ఇంటిపేరు లేదే అని పవన్ అన్నారని, తన ఇంటి పేరును వేదికపై ఉపయోగిస్తావా? అని ప్రశ్నించారు. మీ ముగ్గురి భార్యలను జనాలకు పరిచయం చేయి అంటూ పవన్ పై విమర్శలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement