Thursday, May 2, 2024

హుజురాబాద్ బి ఆర్ ఎస్ ఇంచార్జి గా పాడి కౌశిక్‌ రెడ్డి

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవవర్గం ,బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ , విప్ పాడి కౌశిక్‌ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ హుజూరాబాద్‌ ఇన్‌చార్జిగా కౌశిక్‌ రెడ్డిని నియమించారు.
ఈ మేరకు బీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ హుజురాబాద్ అభ్యర్థి పాడి అనే సంకేతాన్ని కె సి ఆర్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డి నియామకం పట్ల బి ఆర్ ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement